Telangananews

Apr 12 2023, 10:37

డేటా చోరీ లో బిగ్ బాస్కెట్​, పాలసీబజార్, HDFC ఖాతాదారుల వివరాలు... 19మందిని అరెస్ట్...

డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సిట్ పోలీసులు,  బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు,

హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు.

 బిగ్ బాస్కెట్​కు సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు, పాలసీబజార్ వినియోగదారుల వివరాల లీకేజీ పై సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్​లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.

 HDFC బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.

Telangananews

Apr 10 2023, 15:40

మరో సారి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అరకిలో బంగారం పట్టివేత...

కస్టమ్స్​ అధికారులు స్మగ్లర్ల ఆటలు కట్టించినా ఎయిర్ పోర్టులన్నీ అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. స్మగ్లర్లు  పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు.  

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేయగా... స్క్రూస్ రూపంలో అరకిలో బంగారం అమర్చినట్లు గుర్తించారు. వెంటనే బ్యాగ్‌ను సీజ్ చేసి ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. 21.20 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Telangananews

Apr 10 2023, 11:45

Shamshabad Air Port : ఆఖరి నిమిషంలో విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా... ఎందుకంటే...

హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిరిండియాకు సంబంధించిన విమానాలను ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ... రద్దు చేసింది యాజమాన్యం. 

 ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అప్పటికే విమానాశ్రయం చేరుకున్న 40 మంది ప్రయాణీకులు.

ప్రయాణికులను శాంతింపజేసిన యాజమాన్యం తక్షణమే డబ్బులు రీఫండ్ చేశారు. 

 హైదరాబాద్ నుండి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు, అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.

Telangananews

Apr 05 2023, 16:11

ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై IPS అధికారుల సంఘం సీరియస్ అయింది. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అంజనీకుమార్ అమలు చేస్తున్నారని రఘునందన్ రావు అన్న వ్యాఖ్యలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. రఘనందన్ రావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్వీకర్ కు ఫిర్యాదు చేశారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రఘునందన్ వ్యాఖ్యాలు ఉన్నాయని వెల్లడించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది.

Telangananews

Apr 05 2023, 16:06

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఛానెల్పై నిషేదం ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మలయాళ వార్తా ఛానెల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యూస్‌ ఛానెల్‌ టెలికాస్ట్‌ను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి మీడియా వన్ ఛానెల్ ను బ్యాన్ చేసింది. దాంతో ఆ ఛానెల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు ఇవాళ (ఏప్రిల్ 5) విచారణ చేపట్టింది.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరకంగా ఛానెల్‌ చేసిన ప్రసారాలను.. పత్రికా వ్యవస్థకు విరుద్ధమైనవిగా పరిగణించలేమని సుప్రీం అభిప్రాయపడి ఛానెల్ పై విధించిన బ్యాన్ ను తొలగించింది. పటిష్టమైన ప్రజాస్వామ్యాం కోసం స్వతంత్ర పత్రికా వ్యవస్థ అవసరమని డివై చంద్రచూడ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియావన్ ఛానెల్‌పై జాతీయ భద్రతా వాదనలు లేవనెత్తినందుకు హోమ్‌ మంత్రిత్వశాఖను సుప్రీం నిలదీసింది.

Telangananews

Apr 05 2023, 12:49

భూమిని పోలిన గ్రహం నుంచి రేడియో సిగ్నల్స్..

ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాన్ని కొన్ని ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. భూమిలా జీవానికి అవసరం అయ్యే పరిస్థితుల ఏ గ్రహానికైనా ఉన్నాయా అని మన పాలపుంతలో శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని వందల ఎక్సో ప్లానెట్స్ గుర్తించినప్పటికీ భూమిని పోలిన గ్రహాల్లో జీవాలు ఉండే అవకాశం మాత్రం దాదాపుగా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా భూమి పరిమాణం ఉన్న ఓ ఎక్సో ప్లానెట్ ను గుర్తించారు. ఈ గ్రహం నుంచి వస్తున్న రేడియో సిగ్నల్స్ ను కనుగొన్నారు. భూమి లాంటి అయస్కాంత క్షేత్రాన్ని కలిగి, వాతావరణం కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావంతో తన మాతృనక్షత్రం నుంచి విడుదలయ్యే హైఎనర్జీ పార్టికల్స్ ను తిప్పికొడుతూ తన వాతావరణాన్ని కాపాడుకుంటుందని, నక్షత్రం నుంచి వెలువడే విస్పోటనాలు ఈ అయస్కాంత క్షేత్రం గ్రహాన్ని కాపాడుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నక్షత్రం, గ్రహం మధ్య జరిగే చర్యల వల్ల రేడియో సిగ్నల్స్ ఉత్పన్నం అవుతున్నాయి.

ఈ గ్రహం భూమి నుంచి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ మరుగుజ్జు నక్షత్రం ‘వైజెడ్ సెటి’ నక్షత్రం చుట్టూ ఈ గ్రహం ‘వైజెడ్ సెటీ బి’ పరిభ్రమిస్తోంది. కొలరాడో యూనివర్సిటీ, బక్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెబాస్టియన్ పినెడ, జాకీ విల్లాడ్ సెన్, కార్ల్. జి జాన్స్కీ వేరి లార్జ్ అర్రే అనే రేడియో టెలిస్కోప్ ద్వారా వైజెడ్ సెటీ నుంచి వెలువడుతున్న సిగ్నల్స్ ను రికార్డ్ చేశారు. ఒక గ్రహం వాతావరణాన్ని కలిగి ఉందా లేదా..? అనేది దాని అయస్కాంత క్షేత్రం బలంపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

వైజెడ్ సెటీ బీ గ్రహం తన మాతృ నక్షత్రం చుట్టూ 2 రోజుల్లోనే పరిభ్రమణం పూర్తి చేస్తుంది. అంటే దాదాపుగా మన సౌర కుటుంబంలోని బుధుడి కక్ష్యకు సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గురుగ్రహాల వంటి భారీ గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టారు. అయితే భూమి వంటి చిన్న గ్రహాల అయస్కాంత క్షేత్రాలను కనిపెట్టేందుకు ఓ నమూనాను తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Telangananews

Apr 05 2023, 12:43

ప్లాస్టిక్ తెచ్చిచ్చి గోల్డ్ తీస్కెళ్లండి!

 అది దక్షిణ కాశ్మీర్​లోని అనంత్ నాగ్ జిల్లాలోని సాడీవారా గ్రామం. చాలా ఊర్లలాగే ఆ ఊరు కూడా ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయింది. రోడ్ల వెంట, వీధుల్లో ఎక్కడ చూసినా వాడి పారేసిన పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. చెత్తను తొలగించేందుకు గ్రామ పంచాయతీ నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ పేరుకుపోతూనే ఉంది. అందుకే ఆ గ్రామ సర్పంచ్, అడ్వొకేట్ ఫరూక్ అహ్మద్ గనై ఒక ప్లాన్ వేశాడు.

గ్రామస్తులు 20 క్వింటాళ్ల ప్లాస్టిక్​ను సేకరించి ఇస్తే పంచాయతీ తరఫున ఒక గోల్డ్ కాయిన్ ఇస్తామని ప్రకటించాడు. దీంతో ఊరోళ్లంతా ప్లాస్టిక్ వేటలో పడ్డారు. రోడ్లు, వీధుల వెంబడి మాత్రమే కాదు.. ఊరి పక్కనున్న నదిలో, వాగులు, కాలువల్లోనూ పడి ఉన్న ప్లాస్టిక్ ను సేకరించి తీసుకొచ్చారు. మొత్తంగా పదిహేను రోజుల్లోనే ఊరంతా ప్లాస్టిక్ చెత్త లేకుండా క్లీన్ అయిపోయింది. గ్రామాలను క్లీన్​గా ఉంచుకోవడంలో సాడీవారా ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిందని ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నరు. అయితే.. గ్రామంలో ప్లాస్టిక్ చెత్తను సేకరించినందుకు ఎంత మందికి గోల్డ్ కాయిన్ లు ఇచ్చారన్నది మాత్రం వెల్లడి కాలేదు.

Telangananews

Mar 31 2023, 16:19

నిజామాబాద్ లో కలకలం.. మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుంది. విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమ ఆత్మవిశ్వాన్ని కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి మంచి భవిష్యత్తుకై ఎదగాల్సిన విద్యార్తులు ఇలా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తారనే తల్లిదండ్రులు ఆశలను అడిఆశలు చేస్తూ వారికి పుట్టెడుదుఖాన్ని మిగిలిస్తున్నారు. అలాంటి మరో ఘటన నిజామాబాద్ మెడికల్ కళాశాలలో చోటుచేసుకోవడంతో విద్యార్థులకు తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్‌ పెద్ద పల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. MBBS మూడవ సంవ్సతరం పరీక్షలు రాసిన సనత్.. ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతుంగా సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు మెడికల్ కాలేజీ అధికారులు సమాచారం ఇచ్చారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళన గురిచేస్తున్నాయి. 

ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష నిజామాబాద్‌లో మెడిసిన్‌ చదువుతున్నాడు. ఈ ఉదయం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగి మెడిసిన్ చదువుతున్న హర్ష మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పరీక్ష రాయాల్సిన హర్ష పరీక్షలకు హాజరు కాకుండా హాస్టల్‌లోనే ఉన్నాడు. పరీక్షల్లో ఎందుకు ఉత్తీర్ణత సాధించకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు హాస్టల్‌కు వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangananews

Mar 31 2023, 15:54

అలాంటి యాడ్స్ లో నటించొద్దు.. అమితాబ్ కి సజ్జనార్ రిక్వెస్ట్

యాడ్స్.. ప్రజెంట్ మార్కెట్లో చాలా కీలకం. కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ను అమ్ముకోవడం కోసం ఎన్నో ఎత్తులు పై ఎ్తతులు వేస్తాయి. కోట్లు పెట్టి సెలబ్రిటీలతో యాడ్స్ తీసి సొమ్ము చేసుకుంటాయి ఈ కంపెనీలు. సెలబ్రిటీలు కూడా ఆ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులు, ప్రొడక్ట్స్ మంచివా, హానికరమైనవా చూడకుండా ప్రకటనల్లో నటిస్తారు. తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటారు.  

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా అమెరికాకు చెందిన ఆమ్వే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఇలాంటి యాడ్స్ చేయొద్దని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్  అమితాబ్ కి సూచించారు. ఆమ్వే లాంటి మోసపూరిత కంపెనీలకు సహకరించొద్దని ట్విట్టర్లో అభ్యర్థించారు. దేశ సామాజిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఇలాంటి గొలుసు కట్టు సంస్థలను ప్రమోట్ చేయొద్దని సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు సజ్జనార్. 

ఆమ్వే కంపెనీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ కు పాల్పడుతోందని ఈడీ 2022 లో ఆరోపించింది. ఆమ్వే ఆస్తులను సీజ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Telangananews

Mar 30 2023, 15:57

తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు. 

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న తిరిగి స్కూళ్లు రీ-ఓపెన్ అవుతాయి. 

అకాడమిక్ ఇయర్ క్యాలెండర్‌కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.